airport: ముంబయి ఎయిర్‌పోర్టులోని కార్గో విమానంలో ఐఎస్ఐఎస్ పేరిట బెదిరింపు లేఖ‌.. క‌ల‌క‌లం!

  • ముంబయి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఘ‌ట‌న‌
  • బాత్‌ రూంలో ఐఎస్ఐఎస్ పేరిట లేఖ‌
  • త‌నిఖీలు చేసిన‌ పోలీసులు, సీఐఎస్‌ఎప్‌ దళాలు
  • జనవరి 26, 2018న దాడి చేస్తామంటూ లేఖ‌

ముంబయి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో అల‌జ‌డి చెల‌రేగింది. ఆ ఎయిర్‌పోర్టులోని కార్గో విమానం బాత్‌ రూంలో ఐఎస్ఐఎస్ పేరిట‌ ఓ బెదిరింపు లేఖ క‌న‌ప‌డింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు, సీఐఎస్‌ఎప్‌ దళాలు విస్తృతంగా త‌నిఖీలు చేశారు. ప్ర‌స్తుతం ప్రయాణికుల‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే ఎయిర్‌పోర్టులోకి అనుమతినిస్తున్నారు. జనవరి 26, 2018న దాడి చేస్తామంటూ ఆ బెదిరింపు లేఖ‌లో ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఈ లేఖ గురించి తెలియ‌గానే విమానాశ్ర‌యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ విష‌యంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News