ram: 'నేను లోకల్' దర్శకుడితో రామ్ .. త్వరలో సెట్స్ పైకి!

  • రామ్ 16వ సినిమాకి రంగం సిద్ధం 
  • నిర్మాతగా దిల్ రాజు 
  • ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • త్వరలోనే టైటిల్ ప్రకటన

లుక్ విషయంలో .. కథ విషయంలో రామ్ చాలా జాగ్రత్తలు తీసుకుని, ఈ మధ్య 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆయన అభిమానులను అలరించలేకపోయింది. అయినా రామ్ డీలాపడిపోకుండా తన తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. ఆయన తన నెక్స్ట్ మూవీని త్రినాథరావు నక్కినతో చేయనున్నాడు.

 'నేను లోకల్'తో ఈ డైరెక్టర్ నానికి సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి త్రినాథరావు చెప్పిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకావడం జరిగిపోయాయి. రామ్ కెరియర్లో 16వ సినిమా ఇది .. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం కథానాయిక అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు.  

  • Loading...

More Telugu News