sai dharam ttej: మెహ్రీన్ కొంచెం కంగారు పడింది: సాయిధరమ్ తేజ్

  • మెహ్రీన్ కి అంకితభావం ఎక్కువ 
  • పాత్ర కోసం ఆమె చాలా కష్టపడుతుంది 
  • ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసింది  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' చిత్రం తెరకెక్కింది. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిధరమ్ తేజ్ బిజీగా వున్నాడు. ఈ సినిమాలో దేశభక్తి కలిగిన యువకుడిగా సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడు.

"మెహ్రీన్ పాత్ర ఎలా ఉంటుంది?" అనే ప్రశ్న ఆయనకి యోయో సినీ టాకీస్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " మెహ్రీన్ కి అంకితభావం ఎక్కువ .. పాత్ర కోసం ఆమె చాలా కష్టపడుతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర హీరో పాత్రను డామినేట్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ తరహా పాత్ర చేయడం అంత తేలికైన విషయం కాదు. పైగా అప్పటివరకూ ఆమె గ్లామర్ ప్రాధాన్యత కలిగిన పాత్రలనే చేస్తూ రావడం వలన కాస్త కంగారు పడింది. ఆ తరువాత పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని చాలా బాగా చేసింది" అంటూ చెప్పుకొచ్చాడు.      

  • Loading...

More Telugu News