Sri Lanka: శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ

  • వ‌న్డే సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి
  • విశ్రాంతి లేదంటూ ఇటీవ‌లే మండిప‌డ్డ కోహ్లీ
  • టెస్టు సిరీస్ త‌రువాత శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌

భార‌త్-శ్రీలంక మ‌ధ్య జ‌రుగుతోన్న‌ మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే. మూడో టెస్టు అనంత‌రం శ్రీలంక‌తో భార‌త్ వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ త‌రువాత‌ విరాట్ కోహ్లీకి కాస్త‌ విరామం ఇవ్వాలని జట్టు సెలక్టర్లు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీలంక‌తో జ‌రిగే టీ-20 సిరీస్‌కి కూడా కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు నిర్వ‌హిస్తాడ‌ని సెలెక్ట‌ర్లు ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ‌కు అస‌లు విరామం ఇవ్వ‌డం లేద‌ని, వ‌రుస‌గా ఒక సిరీస్ త‌రువాత‌ మ‌రోటి ఆడుతూనే ఉన్నామ‌ని విరాట్ కోహ్లీ ఇటీవ‌లే మండిప‌డ్డ విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News