ankita: పండంటి బాబుకు జన్మనిచ్చిన నిన్నటి హీరోయిన్ అంకిత!

  • 'సింహాద్రి' సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న అంకిత
  • 2016లో జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ తో వివాహం
  • నిన్న తల్లిగా మారిన అంకిత 

ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'సింహాద్రి' సినిమాలో ఓ కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న 'అంకిత'.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో 2016లో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జేపీ మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయిన విశాల్ ను వివాహం చేసుకుంది. అనంతరం సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. ఈ నిన్న (నవంబర్ 26) పండంటి బాబుకు అంకిత జన్మనిచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆమధ్య ఒక టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా వైవాహిక జీవితంలో ఆనందంగా ఉన్నానని అంకిత చెప్పిన సంగతి విదితమే. 

  • Loading...

More Telugu News