Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రకుల్ హిందీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు 
  • పాటల కోసం దుబాయ్ వెళుతున్న 'జైసింహా'
  • ప్రభాస్ తో కలసి చేస్తానంటున్న గోపీచంద్ 
  • దర్శకుడిగా మారిన మరో రచయిత

*  ఇటు తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూనే అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హిందీలో 'ఆయారే' అనే చిత్రంలో నటించింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు.
*  బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జైసింహా' చిత్రం షూటింగుకు సంబంధించి ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. డిసెంబర్ 7 నుంచి 17 వరకు ఈ పాటలను దుబాయ్ లో చిత్రీకరిస్తారు. వీటిలో ఓ పాటను బాలయ్య, నయనతారలపైనా, మరో పాటను బాలయ్య, నటాషా లపైనా చిత్రీకరిస్తారు.  
*  తన మిత్రుడు ప్రభాస్, తాను కలసి ఓ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే మంచి కథ దొరకడం లేదని చెప్పాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఇద్దరికీ సూటయ్యే కథ కోసం వెయిట్ చేస్తున్నామని అన్నాడు. కాగా, వీరిద్దరూ కలసి గతంలో 'వర్షం' సినిమాలో నటించిన సంగతి విదితమే.
*  ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారాడు. ఆయన దర్శకత్వంలో రూపొందే 'బృందావనమది అందరిది' చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నూతన నటీనటులు నటించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును వచ్చే నెల 20 నుంచి కేరళలో నిర్వహిస్తామని దర్శకుడు చెప్పాడు.

  • Loading...

More Telugu News