India: 610/6 వద్ద డిక్లేర్ చేసిన ఇండియా... సెంచరీల మోత మోగించిన బ్యాట్స్ మెన్!

  • డ‌బుల్ సెంచ‌రీ బాదిన కోహ్లీ
  • సెంచ‌రీలు కొట్టిన రోహిత్ శ‌ర్మ, ముర‌ళీ విజ‌య్, చ‌టేశ్వ‌ర్ పుజారా
  • 610/6 (176.1 ఓవ‌ర్లవ‌ద్ద‌) వ‌ద్ద‌ డిక్లేర్ ‌చేసిన ఇండియా 

నాగ్‌పూర్‌లో జ‌రుగుతోన్న శ్రీలంక-భార‌త్ టెస్టు మ్యాచులో టీమిండియా భారీ స్కోరు చేసింది. కోహ్లీ (213) , రోహిత్ శ‌ర్మ‌(102 నాటౌట్‌), ముర‌ళీ విజ‌య్ (128),  చ‌టేశ్వ‌ర్ పుజారా (143) అద్భుతంగా రాణించ‌డంతో 610/6 (176.1 ఓవర్లు‌) స్కోరు వద్ద భారత్ డిక్లేర్ చేసింది.

టీమిండియా మిగ‌తా బ్యాట్స్‌మెన్ లో లోకేశ్ రాహుల్ 7, ర‌హానె 2, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 5, వృద్ధిమాన్ సాహా 1 (నాటౌట్‌) ప‌రుగులు చేశారు. శ్రీలంక మొద‌టి ఇన్నింగ్స్‌లో 205 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. శ్రీలంక‌పై భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 405 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. 

  • Loading...

More Telugu News