sai dharam thej: చిరూ రీమిక్స్ సాంగ్స్ విషయంలో చరణ్ నన్నెప్పుడూ ప్రశ్నించలేదు: సాయిధరమ్ తేజ్

  • నేను చేసిన రీమిక్స్ సాంగ్స్ చరణ్ చూశాడు 
  • బాగా చేశానంటూ అభినందించాడు 
  • ఆయన అలా ఎప్పుడూ అడగలేదు

సాయిధరమ్ తేజ్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలనే ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. తన సినిమాల్లోని పాటలు .. డాన్సులు కూడా అదే స్టైల్లో ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చిరంజీవి సినిమాల్లోని 'గువ్వా .. గోరింకతో' .. 'అందం హిందోళం.. ' అనే సాంగ్స్ ను రీమిక్స్ చేశాడు. ఈ విషయంలో చరణ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇకపై అలా చేయాలనుకుంటే తనని అడిగే చేయాలని అన్నట్టుగా ఒక టాక్ వినిపించింది.

 అందుకు సంబంధించిన ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ కి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. "అలాంటిదేం జరగలేదు .. ఎవరూ నా దగ్గర అనలేదు కూడా. ఈ విషయాన్ని గురించి నేను .. చరణ్ ఎప్పుడూ చర్చించింది లేదు. ఆ రీమిక్స్ సాంగ్స్ ను చరణ్ చూసి నన్ను అభినందించడం జరిగింది. 'ఈ సాంగ్ నువ్వెందుకు చేశావ్?' అని ఆయన ఎప్పుడూ అడిగింది లేదు" అని చెప్పుకొచ్చాడు.   

  • Loading...

More Telugu News