sushma swaraj: సుష్మాస్వ‌రాజ్‌కు పోచంప‌ల్లి చీర‌ను బ‌హూక‌రించిన మంత్రి కేటీఆర్‌

  • ఢిల్లీలో కేటీఆర్ బిజీబిజీ
  • సుష్మాస్వ‌రాజ్‌తో భేటీ
  • యూఏఈ జైలులో సిరిసిల్ల వాసుల గురించి చర్చించిన మంత్రి 

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త‌ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వ‌రాజ్‌తో కేటీఆర్ స‌మావేశం అయి, రాష్ట్రానికి సంబంధించిన‌ ప‌లు అంశాల‌ను వివ‌రించారు. యూఏఈలో 11 ఏళ్లుగా శిక్ష అనుభ‌విస్తోన్న ఐదుగురు సిరిసిల్ల వాసుల గురించి తాను సుష్మా స్వ‌రాజ్‌కు వివ‌రించాన‌ని కేటీఆర్‌ చెప్పారు. వారి గురించి యూఏఈ అధికారుల‌తో మాట్లాడాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు తెలిపారు. అలాగే, తాను సుష్మాస్వ‌రాజ్‌కి పోచంప‌ల్లి చేనేత చీర‌ను బ‌హూక‌రించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ఫొటోల‌ను కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  

  • Loading...

More Telugu News