nidhi adarwal: అందరి దృష్టి నిధి అగర్వాల్ పైనే!

  • 'మున్నా మైఖేల్' లో మెరిసిన నిధి అగర్వాల్
  • 'సావ్యసాచి'లో కథానాయికగా ఛాన్స్ 
  • ఆమె గ్లామర్ కి ఫుల్ మార్క్స్ 
  • స్టార్ హీరోయిన్  అవుతుందంటూ అభిప్రాయాలు      

తెలుగు తెరకి మరో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. ఆ కథానాయిక ఎవరో కాదు .. 'మున్నా మైఖేల్' చిత్రంలో మెరిసిన నిధి అగర్వాల్. నాగ చైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. గ్లామర్ పరంగా .. డాన్స్ పరంగా నిధి అగర్వాల్ కి వంకబెట్టవలసిన పనిలేదు.

 అందువలన యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. 'సవ్యసాచి'లో ఈ అమ్మాయి చేయనుందని తెలియగానే అందరిదృష్టి ఆ వైపు మళ్లింది. దాంతో మిగతా దర్శక నిర్మాతల దృష్టి సహజంగానే నిధి అగర్వాల్ పై పడింది. దాంతో తమ సినిమాల్లో కథానాయికగా ఆమెను తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు కథానాయికగా ఆమెకి ఛాన్స్ ఇవ్వడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారట. భవిష్యత్తులో ఈ అమ్మాయి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉండటం విశేషం.          

  • Loading...

More Telugu News