Balakrishna: చంద్ర‌బాబు అప‌ర భ‌గీర‌థుడిగా నిలిచారు: బాల‌కృష్ణ‌

  • పోల‌వ‌రం ప‌నులు, ప‌ట్టిసీమ ప్రాజెక్టును ప‌రిశీలించిన ప్రజాప్రతినిధులు 
  • రాష్ట్ర ప్ర‌భుత్వం చొర‌వ‌తో పోల‌వ‌రం ప‌నులు వేగవంతం
  • చంద్ర‌బాబు పేరును రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ చెప్పుకుంటున్నారు

రాష్ట్ర ప్ర‌భుత్వ చొర‌వ‌తో పోల‌వ‌రం ప‌నులు వేగంగా కొన‌సాగుతున్నాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణ అన్నారు. ఈ రోజు పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించ‌డానికి ప్రజాప్రతినిధులు ఆయా ప్ర‌దేశాల‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ... పోల‌వ‌రం పూర్త‌యితే రాష్ట్రం స‌స్య‌శ్యామ‌లం అవుతుందని అన్నారు. ప‌ట్టిసీమ‌కు రూప‌క‌ల్ప‌న చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అప‌ర భ‌గీర‌థుడిగా నిలిచారని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడి పేరును రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ చెప్పుకుంటారని అన్నారు. 

  • Loading...

More Telugu News