chiranjeevi: 'సైరా' కోసం విదేశాల నుంచి 200 మంది జూనియర్ ఆర్టిస్టులు!

  • డిసెంబర్ 6వ తేదీన సెట్స్ పైకి 'సైరా'
  • తొలి షెడ్యూల్లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ 
  • ఆంగ్లేయ సైన్యం కోసం విదేశాల నుంచి జూనియర్ ఆర్టిస్టులు 
  • హైదరాబాద్ శివారుల్లో చిత్రీకరణ  

'సైరా' సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ శివారుల్లో ప్లాన్ చేశారు. ఇక్కడ ఆంగ్లేయ సైన్యంతో నరసింహా రెడ్డి తలపడే భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

 అందుకోసం విదేశాల నుంచి 200 మంది జూనియర్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఫస్టు షెడ్యూల్ లోనే భారీ పోరాట సన్నివేశాలను ప్లాన్ చేయడం విశేషం. ఈ సన్నివేశాలను కొత్తగా డిజైన్ చేయించిన దర్శకుడు సురేందర్ రెడ్డి .. తనదైన శైలిలో ఆ సన్నివేశాలను చిత్రీకరించడానికి రెడీ అవుతున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.    

  • Loading...

More Telugu News