Balakrishna: 'జై సింహా' ఆడియో రిలీజ్ తేదీ ఖరారు!

  • షూటింగ్ దశలో 'జై సింహా'
  • సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్ 
  • ఆడియో రిలీజ్ కి సన్నాహాలు
  • వేదికగా విజయవాడ  

బాలకృష్ణ 102వ సినిమాగా 'జై సింహా' తెరకెక్కుతోంది. కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన విశాఖపట్నం షెడ్యూల్ ముగిసింది.

ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో విడుదల తేదీగా డిసెంబర్ 23ను నిర్ణయించారు. పలువురు సినీ ప్రముఖులు .. అభిమానుల సమక్షంలో ఈ వేడుకను విజయవాడలో జరపనున్నారు. చిరంతన్ భట్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కావడం .. బాలకృష్ణతో ముగ్గురు కథానాయికలు జోడీ కట్టడంతో మాస్ ఆడియన్స్ వైపు నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి.     

  • Loading...

More Telugu News