balakrishna: విశాఖ సాగర తీరంలో 'జై సింహా' సందడి .. ఆకట్టుకుంటోన్న న్యూ పిక్స్!

  • బాలకృష్ణ కథానాయకుడిగా 'జై సింహా' 
  • విశాఖలో కొనసాగుతోన్న షూటింగ్ 
  • బాలయ్య సరసన ముగ్గురు కథానాయికలు
  • జనవరి 12వ తేదీన భారీ రిలీజ్    

బాలకృష్ణ 102వ సినిమాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.  రీసెంట్ గా బాలకృష్ణ - నయనతార కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించిన రవికుమార్, ప్రస్తుతం బాలకృష్ణ - హరిప్రియ కాంబినేషన్లోని సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ స్పాట్ కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందువలన ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను వదులుతున్నట్టు సమాచారం. బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి.  

  • Loading...

More Telugu News