modi: మెట్రో రైల్ ప్రారంభోత్స‌వానికి మోదీ హాజ‌రుపై ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉంది: కేటీఆర్

  • ఈ నెల 28న ప‌రుగులు పెట్ట‌నున్న హైద‌రాబాద్ మెట్రోరైల్‌?
  • ఇప్పటికే ప్ర‌ధాని మోదీకి ఆహ్వానం
  • ఈ నెల 15 నాటికి మెట్రో రైల్ తొలిద‌శ స‌ర్వం సిద్ధం

హైదరాబాదీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హైద‌రాబాద్ మెట్రో రైల్ మొద‌టి ద‌శ‌ ప‌నులు ముగింపున‌కు చేరుకున్నాయి. ఈ నెల 15 నాటికి మెట్రో రైల్ ప్రారంభానికి రెడీ అవుతుంద‌ని, ఈ నెల 28న మెట్రోరైల్‌ను ప్రారంభించాలని తాము ఇప్ప‌టికే ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీని కోరామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో జ‌రిగే ప్రపంచ భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి మోదీ వస్తున్నార‌ని, అలాగే మెట్రోరైల్ ప్రారంభిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. అయితే, మెట్రో రైల్ ప్రారంభోత్స‌వానికి మోదీ హాజ‌రుకానున్న విషయాన్ని ప్ర‌ధాని కార్యాలయం ఇంకా ధ్రువీకరించలేద‌ని తెలిపారు. న‌గ‌ర‌వాసుల క‌ల‌ల బండి మెట్రోరైల్‌ను ప్రారంభిస్తే ట్రాఫిక్ జామ్ స‌మ‌స్య కాస్తయినా త‌గ్గుతుంద‌ని అంచ‌నా.  

  • Loading...

More Telugu News