charan: 'రంగస్థలం' కోసం విలేజ్ నేపథ్యంలో జాతర సెట్!

  • షూటింగు దశలో 'రంగస్థలం'
  • నిన్నటి నుంచి షూటింగుకి చరణ్, సమంత
  • ఇద్దరి కాంబినేషన్లో కీలక సన్నివేశాలు  

'రంగస్థలం 1985' సినిమా కోసం హైదరాబాద్ - భూత్ బంగ్లా సమీపంలో 'జాతర' సెట్ వేశారు. 1980 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్ ను రూపొందించారు. ఈ సెట్ కి సంబంధించిన ఒక స్టిల్ ను చరణ్ రిలీజ్ చేయగా .. మరో స్టిల్ ను సమంత వదిలింది. బొమ్మల కొట్లు .. రంగుల రాట్నం .. జనం సందడితో కలర్ ఫుల్ గా వున్న ఈ స్టిల్ అందరినీ ఆకట్టుకునేలా వుంది.

 మనాలీలో భార్యతో కలిసి షికారును పూర్తి చేసిన చరణ్, దగ్గుబాటి ఫ్యామిలీతో గెట్ టు గెదర్ పూర్తి చేసిన సమంత నిన్నటి నుంచి ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. జాతర నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. గ్రామీణ నేపథ్యంలో జాతర సీన్లు మాస్ ఆడియన్స్ మనసును పట్టేస్తాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జాతరలో చరణ్ .. సమంత కలిసి చేసే సందడి ఏ రేంజిలో ఉంటుందో చూడాలి మరి.   

  • Loading...

More Telugu News