srinivas: యంగ్ హీరో మంచి స్పీడ్ మీదే వున్నాడు!

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' 
  • శ్రీనివాస్ జోడీగా పూజా హెగ్డే 
  • 50 శాతం చిత్రీకరణ పూర్తి  

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా 'సాక్ష్యం' రూపొందుతోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారాణాసి .. పొల్లాచ్చిలలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. 'బళ్లారి'లో కొన్ని రోజులుగా ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

 తాజాగా ఈ షెడ్యూల్ కూడా ముగియడంతో, ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టు అయింది. పంచభూతాలకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. జగపతిబాబు .. మీనా .. శరత్ కుమార్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.  

  • Loading...

More Telugu News