Jagan: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జగన్ పాదయాత్ర ప్రారంభం నేడే!

  • జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభం నేడే
  • ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర 
  • సుమారు 3,000 కిలోమీటర్ల ప్రయాణం 
  • రోజూ 15 కిలోమీటర్ల నడక

వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటి ఉదయం ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు అంటే సుమారు 3,000 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర జరగనుంది. ఈ క్రమంలో నేటి ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో బహిరంగ సభ జరగనుంది. పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీకి చెందిన కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యం గురించి ఆయన ప్రజలకు వివరించనున్నారు. రోజూ 15 కిలోమీటర్ల దూరం నడవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ఆదరించి, జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. కాగా, పాదయాత్ర నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం, కడప పెదదర్గాను కూడా జగన్ సందర్శించారు. రాష్ట్రం, ప్రజలు బాగుండాలని కోరుకుంటూ తాను ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నానని జగన్ తెలిపారు. 

  • Loading...

More Telugu News