Anushka: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అనుష్కతో గౌతమ్ మీనన్ చిత్రం 
  • సుధీర్ బాబు సరసన అదితీరావు 
  • నాలుగు మిలియన్ల ఫాలోవర్లతో రానా 
  • 'మెహబూబా' తొలి షెడ్యూలు పూర్తి


*  ప్రస్తుతం 'భాగమతి' చిత్రంలో నటిస్తున్న అనుష్క తన తదుపరి చిత్రాన్ని గౌతమ్ మీనన్ తో చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో మరికొందరు అగ్ర నటులు కూడా నటించే అవకాశం వుంది.    
*  సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో 'చెలియా' ఫేం అదితీరావు హైదరీ కథానాయికగా నటిస్తుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కొత్తతరం ప్రేమ కథా చిత్రంగా ఇది రూపొందుతుందని దర్శకుడు ఇంద్రగంటి తెలిపారు. వచ్చే నెలలో దీని షూటింగ్ మొదలవుతుంది.
*  బాహుబలి, ఘాజీ చిత్రాలతో తన ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న రానా దగ్గుబాటి ట్విట్టర్ ఫాలోవర్లు కూడా అమాంతం పెరిగిపోయారు. తాజాగా నాలుగు మిలియన్ల (నలభై లక్షలు) ఫాలోవర్లతో మహేశ్ బాబు, నాగార్జునల తర్వాత స్థానం సంపాదించుకున్నాడు.
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మెహబూబా' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ముగిసింది. రెండు వారాల పాటు హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత ప్రాంతాలలో ఈ షూటింగ్ జరిగింది. తదుపరి షెడ్యూలును పంజాబ్, రాజస్థాన్ లలో ప్లాన్ చేస్తున్నారు. ఆకాష్ పూరీ, నేహా శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు.        

  • Loading...

More Telugu News