tea: టీలో పురుగుల మందు.. పదేళ్ల బాలిక స‌హా న‌లుగురి మృతి!

  • అది పురుగుల మంద‌ని తెలియ‌క టీలో కలిపిన ప‌దేళ్ల బాలిక‌
  • మ‌రో మ‌హిళ ప‌రిస్థితి విష‌మం
  • బీహార్‌లోని దర్బాంగా జిల్లాలోని బహదూర్‌పూర్‌లో ఘ‌ట‌న‌

పురుగుల మందు క‌లిసిన టీ తాగిన న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న బీహార్‌లోని దర్బాంగా జిల్లాలోని బహదూర్‌పూర్‌లో చోటు చేసుకుంది. అర్చన అనే పదేళ్ల బాలిక త‌మ కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేసింది. అయితే, అందులో పొరపాటున పురుగుల మందు కలిపింది. ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యులు కూడా గుర్తించ‌లేక‌పోవ‌డంతో ఈ ఘోరం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు దుఖాన్‌ మహ్తో (60), రామ్‌స్వరూప్‌ మహ్తో (65), టీ పెట్టిన బాలిక‌ అర్చన (10), ప్రకాశ్‌మెహ్తోలుగా అక్కడి అధికారులు గుర్తించారు.    

tea
  • Loading...

More Telugu News