Chandrababu: హైద‌రాబాద్‌లో టీటీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు కీల‌క భేటీ

  • హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం
  • ఎల్‌.ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పాటు ముఖ్య నేత‌లు హాజరు
  • తెలంగాణ‌లో టీడీపీని బ‌లోపేతం చేయ‌డంపై ప్ర‌ధానంగా చ‌ర్చ‌

హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రుగుతోంది. ఈ సమావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, టీడీపీ నేతలు రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, నామా నాగేశ్వ‌ర‌రావు, పెద్దిరెడ్డి, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, సీతమ్మ‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. తెలంగాణ‌లో టీడీపీని బ‌లోపేతం చేయ‌డంపైన, రేవంత్ రెడ్డి త‌మ పార్టీ నుంచి వెళ్లిపోయాక చోటు చేసుకుంటోన్న ప‌రిస్థితులపైన చంద్ర‌బాబు కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News