charan: 'రంగస్థలం' కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు .. ఆ రోజున రిలీజ్ చేయవచ్చట!

  • గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న 'రంగస్థలం'
  • కొత్త లుక్ తో కనిపించనున్న చరణ్ 
  • కథానాయికగా సమంతా 
  • స్పెషల్ సాంగ్ లో మెరవనున్న పూజా హెగ్డే  

చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'రంగస్థలం 1985' విశేషాల పట్ల అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. గోదావరి జిల్లాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన ఈ సినిమా టీమ్, హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేశారు.

ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు వున్నట్టుగా నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయానికి ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. మార్చి 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. దాదాపు ఇదే తేదీ ఖరారు కావొచ్చని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కనువిందు చేయనుంది.     

  • Loading...

More Telugu News