rajasekhar: తేజ క్లైమాక్స్ మార్చడం కుదరదన్నాడు .. అందుకే నేను ఆ సినిమా వదులుకున్నాను: డా. రాజశేఖర్

  • అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నప్పటి నుంచి తేజ తెలుసు
  • ఆయనను దర్శకత్వం దిశగా ప్రోత్సహించిన వారిలో నేనూ ఒకడిని 
  • తేజ ఆ కథ ముందుగా నాకు వినిపించిన మాట నిజమే        

తేజ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' ఘన విజయాన్ని సాధించింది. ముందుగా ఈ సినిమాను 'అహం' అనే పేరుతో రాజశేఖర్ తో చేయడానికి తేజ ప్రయత్నించాడనీ, కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది రానా దగ్గరికి వెళ్లిందనే వార్తలు వినిపించాయి. అది నిజమేననే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఒప్పుకున్నారు.

" 'వందేమాతరం' సినిమాకి తేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పటి నుంచి నాకు తేజ తెలుసు. ఆయన నా భార్య క్లాస్ మేట్ కావడం వలన మా మధ్య చనువు ఉండేది. ఆయనను దర్శకత్వం వైపుకు వెళ్లమని ప్రోత్సహించిన వారిలో నేనూ ఒకడిని. ముందుగా ఆ కథను ఆయన నాకు వినిపించినప్పుడు, క్లైమాక్స్ వరకూ నచ్చింది .. క్లైమాక్స్ మారిస్తే బాగుంటుందని చెప్పాను. అందుకాయన అంగీకరించకపోవడంతో .. వేరే హీరోతో ట్రై చేయమని అన్నాను. ఆయన అలాగే నంటూ రానాతో ఆ సినిమా చేశాడు" అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.       

  • Loading...

More Telugu News