rajasekhar: 'గరుడ వేగ' రిలీజ్ విషయంలో పుకార్లను నమ్మొద్దు : జీవిత

  • 5..6 కోట్లలో చేద్దామనుకున్న సినిమా
  • 25 కోట్లు దాటిన ఖర్చు
  • యూఎస్ లో 100 స్క్రీన్స్ కేటాయింపు 
  • వచ్చేనెల 3వ తేదీన భారీ రిలీజ్        

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గరుడ వేగ' సినిమా రూపొందింది. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో జీవిత మాట్లాడుతూ, ఈ సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు.

 ముందుగా ఈ సినిమాను 5 .. 6 కోట్లలో చేద్దామని అనుకున్నామనీ, అయితే ఎప్పటికప్పుడు బెటర్మెంట్ కోసం చూడటంతో 25 కోట్లకి పైగా అయిందని అన్నారు. యూఎస్ లో ఈ సినిమా కోసం 100 స్క్రీన్స్ కేటాయించారనీ, ఇక్కడ మాత్రం ఈ సినిమాపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయని చెప్పారు. ఈ సినిమాకి ఫైనాన్షియల్ ప్రోబ్లమ్స్ ఉన్నాయనీ, నవంబర్ 3న రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి పుకార్లు నమ్మవద్దనీ, ఈ సినిమా తప్పకుండా నవంబర్ 3వ తేదీన విడుదలవుతుందని స్పష్టం చేశారు.      

  • Loading...

More Telugu News