balakrishna: 'జై సింహ' మోషన్ పోస్టర్ వచ్చేస్తోంది

  • బాలకృష్ణ తాజా చిత్రంగా 'జై సింహ'
  • దర్శకుడిగా కేఎస్.రవికుమార్
  • నవంబర్ 1న మోషన్ పోస్టర్ రిలీజ్ 
  • జనవరి 12న సినిమా రిలీజ్  

బాలకృష్ణ 102వ సినిమాగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'జై సింహ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 'సింహ'తో ముడిపడిన బాలకృష్ణ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

 ఈ సినిమా నుంచి వచ్చేనెల 1వ తేదీన టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బాలకృష్ణ అభిమానులు ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా వుంటుందనే విషయంలో ఆసక్తిగా వున్నారు. మోషన్ పోస్టర్ రాకతో ఆ సస్పెన్స్ కి తెరపడనుంది. బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.    

  • Loading...

More Telugu News