Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వ‌స్థ‌త.. సిమ్లా నుంచి ఢిల్లీ ఆసుప‌త్రికి త‌ర‌లింపు

  • సిమ్లా నుంచి ఢిల్లీకి త‌ర‌లింపు
  • సోనియా గాంధీకి చికిత్స అందిస్తోన్న వైద్యులు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్ర‌చారం కొన‌సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో సిమ్లాలోనే ఉన్న సోనియా గాంధీ ఈ రోజు సాయంత్రం అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆమెను వెంట‌నే ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News