yogi adityanath: యోగి ఆదిత్య‌నాథ్‌పై అభ్యంతరకర ఫొటోల‌ను పోస్ట్ చేసిన ఏడుగురు ముస్లింల‌పై కేసు న‌మోదు

  • ఫిర్యాదు చేసిన‌ హిందూ యువ‌వాహిని కార్య‌క‌ర్త
  • సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతోన్న యువ‌కులు
  • నిందితుల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌హ‌రాజ్ గంజ్‌కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు

సోష‌ల్ మీడియాలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌పై అభ్యంతరకర ఫొటోల‌ను పోస్ట్ చేసిన ఏడుగురు ముస్లిం యువ‌కుల‌పై ల‌క్నో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ ఏడుగురు యువ‌కులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌హ‌రాజ్ గంజ్‌కు చెందిన‌వార‌ని పోలీసులు తెలిపారు. ఆ యువ‌కులు యోగి ఆదిత్య‌నాథ్ ఫొటోల‌ను అభ్యంత‌ర‌కరంగా మార్పింగ్ చేస్తోన్న విష‌యాన్ని హిందూ యువ‌వాహిని కార్య‌క‌ర్త నార్సింగ్ పాండే త‌మ దృష్టికి తీసుకొచ్చి, కంప్లైంట్ ఇచ్చారని అన్నారు. ఆ ఫొటోలు హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని నార్సింగ్ పాండే ఫిర్యాదు చేశారని అన్నారు.  

  • Loading...

More Telugu News