chiranjeevi: జనవరి నుంచైనా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటోన్న చిరూ!

  • 'సైరా' సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
  • 'రంగస్థలం' షూటింగులో చరణ్ 
  • ఆయన వస్తేనే గాని స్పీడ్ అందుకోని 'సైరా' పనులు

చిరూ అభిమానులంతా ' సైరా నరసింహా రెడ్డి' సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుందన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అప్పటికి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

'రంగస్థలం' షూటింగులో బిజీగా వున్న చరణ్, నిర్మాతగా 'సైరా'కి సంబంధించిన పనులపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నాడట. దాంతో సెట్స్ .. గెటప్స్ కి సంబంధించిన స్కెచ్ వర్క్ దగ్గరే చాలా సమయం గడిచిపోతోందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచైనా సెట్స్ పైకి వెళ్లాలని చిరూ భావిస్తున్నారట.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి రెహ్మాన్ .. కన్నడ నటుడు సుదీప్ తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక జరుగుతోన్న ఆలస్యం కారణంగా.. నయనతార ముందుగా ఇచ్చిన డేట్స్ కాకుండా మరోసారి డేట్స్ ఇవ్వవలసి వస్తుందని అంటున్నారు.    

  • Loading...

More Telugu News