attack: ఆటోలో అక్కాచెల్లెళ్ల‌పై దాడి చేయ‌బోయిన డ్రైవ‌ర్‌.. ఆటోలోంచి దూకేసిన యువ‌తులు!

  • విజ‌య‌న‌గ‌రంలోని బొబ్బిలి మండలం కోమటిపల్లిలో దారుణ ఘ‌ట‌న
  •  ప్ర‌తిఘ‌టించ‌డంతో అక్కాచెల్లెళ్ల‌ను చంపేయ‌బోయిన డ్రైవ‌ర్‌
  •  కోమాలోకి వెళ్లిపోయిన ఓ యువ‌తి

విజ‌య‌న‌గ‌రంలోని బొబ్బిలి మండలం కోమటిపల్లిలో జ‌రిగిన దారుణ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇద్ద‌రు యువ‌తులు ఆటోలో వేధింపుల‌కు గుర‌య్యారు. వివాహిత‌ స్వాతి త‌న చెల్లెలు పావనితో పాటు బొబ్బిలి పట్టణానికి షాపింగ్ కి వచ్చారు. అనంత‌రం చర్చి సెంటర్‌కి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ నరేష్‌ (35) జగన్నాధపురంలోకి ఆటో రాగానే స్వాతిపై లైంగిక దాడి చేయబోయాడు.

దీంతో అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రూ ప్ర‌తిఘ‌టించ‌డంతో వారిని చంపేయ‌బోయాడు. వారిని ఇనుప రాడ్ తో బాదాడు. వెంట‌నే ఆటోలో నుంచి దూకేసిన యువతులు సాయం కోసం కేక‌లు వేశారు. న‌రేష్ దాడిలో స్వాతి కోమాలోకి వెళ్లిపోగా, పావ‌ని స్వల్ప గాయాల పాలైంది. తర్వాత అతి వేగంగా వెళ్లిన న‌రేష్ ఆటో ఆంజనేయ స్వామి ఆలయానికి ఢీకొంది.

 ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన‌ స్థానికులు ఆ యువ‌తుల‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయ‌ని పోలీసులు చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.  

  • Loading...

More Telugu News