nani: కిషోర్ తిరుమల నెక్స్ట్ మూవీ నానితోనే!

  • నాని తాజా చిత్రంగా 'ఎంసిఏ'
  • తదుపరి చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం'
  • నానికి కథ వినిపించిన కిషోర్ తిరుమల 
  • జనవరి నుంచి సెట్స్ పైకి      

ప్రస్తుతం నాని .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఎంసిఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా, చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమా షూటింగును కూడా కానిచ్చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత నాని .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా ఇటీవల కిషోర్ తిరుమల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజాగా ఈ ప్రాజెక్టు ఖరారైందని చెప్పుకుంటున్నారు. నానికి కథ నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. జనవరి నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కిషోర్ తిరుమల సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. నాని స్పీడ్ ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషమేనని చెప్పుకోవాలి.        

  • Loading...

More Telugu News