kamal: 'భారతీయుడు' మూవీ సీక్వెల్ నుంచి కమల్ తప్పుకోలేదట!

  • తెలుగు .. తమిళ భాషల్లో 'భారతీయుడు' ఓ సంచలనం 
  • ఆ మూవీ సీక్వెల్ కి సన్నాహాలు 
  • నిర్మాతగా దిల్ రాజు
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి    

దర్శకుడు శంకర్ సినిమాను ఓ తపస్సులా భావిస్తాడు .. ఓ యజ్ఞంలా పూర్తి చేస్తాడు. అందువల్లనే ఆయన ఖాతాలో భారీ విజయాలు చేరుతుంటాయి .. పాత రికార్డులను తుడిచేస్తుంటాయి. ప్రస్తుతం 'రోబో' సినిమా సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో వున్న శంకర్, ఆ తరువాత 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ చేయనున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడు.

అయితే, ఈ ప్రాజెక్టు నుంచి కమల్ తప్పుకున్నారనీ .. ఆయన ఈ సినిమా చేయడం లేదనే ప్రచారం కొన్ని రోజులుగా జోరందుకుంది. ఈ వార్త నిజమేనా? .. కారణాలేంటి? అనే సందేహాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పందించింది. 'భారతీయుడు' సీక్వెల్ ప్రాజెక్టు నుంచి కమల్ తప్పుకోలేదనీ, ఆయన ఈ సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారని స్పష్టం చేశారు. దాంతో ఈ ప్రచారానికి తెరపడినట్టైంది.    

  • Loading...

More Telugu News