mahesh: మహేశ్ 25వ మూవీకి సంగీత దర్శకుడిగా మళ్లీ దేవిశ్రీనే!

  • యూత్ లో దేవిశ్రీ ప్రసాద్ కి విపరీతమైన క్రేజ్ 
  • 'శ్రీమంతుడు' హిట్ లో పాటల పాత్ర 
  • 'భరత్ అను నేను' సినిమాకి వర్క్ చేస్తోన్న దేవిశ్రీ
  • ఆయన టాలెంట్ పై మహేశ్ కి నమ్మకం

తెలుగులో చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాలకి సంగీత దర్శకుడిగా మొదటి ప్రాధాన్యతను దేవిశ్రీ ప్రసాద్ కే ఇస్తుంటారు. అందువలన వరుస సినిమాలతో దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. యూత్ లో తనకి గల క్రేజ్ తగ్గకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ట్యూన్స్ తో కొత్త ప్రయోగాలు చేసే దేవిశ్రీ సంగీతం పట్ల మహేశ్ బాబు ఆసక్తిని చూపుతూ రావడం గమనించవచ్చు.

మహేశ్ బాబు చేసిన '1 నేనొక్కడినే' సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందించాడు. ఆ తరువాత 'శ్రీమంతుడు' సినిమాతో హిట్ కొట్టిన దేవిశ్రీ ప్రసాద్, ప్రస్తుతం 'భరత్ అను నేను' సినిమాకి కూడా పనిచేస్తున్నాడు. ఈ సినిమాకి బాణీలను అందిస్తూనే .. మహేశ్ 25వ సినిమాను కూడా దేవిశ్రీ ఒప్పుకోవడం విశేషం. కొరటాలతో 'భరత్ అను నేను' చేస్తోన్న మహేశ్, తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా దేవిశ్రీని ఎంపిక చేసుకున్నారు. సంఖ్యా పరంగా మహేశ్ కెరియర్లో ఇది ప్రత్యేకమైన సినిమా అనే విషయం తెలిసిందే.        

  • Loading...

More Telugu News