suicide: ఉపవాసం చేయలేదని భార్యను కత్తితో పొడిచి.. బంగ్లాపై నుంచి దూకి చనిపోయిన భర్త

  • ‘క‌ర్వా చౌత్ ఉప‌వాసం’ విషయంలో గొడవ
  • ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడి 
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భార్య

ఉప‌వాసం చేయ‌లేద‌న్న చిన్న‌ కార‌ణంతో ఓ భ‌ర్త త‌న భార్య‌ను క‌త్తితో పొడిచి, ఆ త‌రువాత తాను కూడా బంగ్లాపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో అత‌డి భార్య‌కు తీవ్ర‌ గాయాల‌య్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, జశ్వింధ‌ర్ సింగ్ అనే వ్య‌క్తికి భార్య‌, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. పుట్టింట్లో ఉన్న భార్య‌ను చూసేందుకు వ‌చ్చిన జ‌శ్వింధ‌ర్ సింగ్.. త‌న భార్య‌ను బంగ్లాపైకి తీసుకెళ్లి ‘క‌ర్వా చౌత్ ఉప‌వాసం’ చేశావా? అని అడిగాడు. ఆమె చెయ్య‌లేద‌ని చెప్పింది.

దీంతో, అక్కడే భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ గొడ‌వ అయింది. ఆగ్ర‌హంతో ఊగిపోయిన భ‌ర్త.. క‌త్తితో త‌న భార్య‌ను పొడిచి, వెంట‌నే బంగ్లా నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ప్ర‌స్తుతం అత‌డి భార్య ఢిల్లీలోని బీఎస్ఏ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ గొడ‌వ జ‌రిగేట‌ప్పుడు అదే ఇంట్లో ఆమె చెల్లి, సోద‌రుడు కూడా ఉన్నారు. 

  • Loading...

More Telugu News