nagarjuna: 'రాజుగారి గది 2'లో గెస్టుగా కాజల్?

  •  ఈ నెల 13న రాజుగారి గది 2' విడుదల
  •  మెంటలిస్ట్ పాత్రలో నాగ్
  •  ఆత్మగా కనిపించనున్న సమంతా
  •  కాజల్ కూడా గెస్టుగా చేసిందంటూ ప్రచారం     

నాగార్జున ప్రధానమైన పాత్రను పోషించిన 'రాజుగారి గది 2' సినిమా .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ పాత్రను పోషించగా, ఆత్మగా సమంతా కనిపించనుంది. ఈ విషయాన్ని నాగార్జున స్పష్టం చేశారు కూడా. తనకి .. సమంతాకి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా వుంటాయని ఆయన అన్నారు.

అయితే తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ కూడా గెస్టుగా చేసిందనేది ఆ వార్త సారాంశం. కాజల్ కూడా ఈ సినిమాలో కొంతసేపు దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం కోసమే ఈ విషయాన్ని దాచారని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శీరత్ కపూర్ కూడా కీలకమైన పాత్రను చేసిన సంగతి తెలిసిందే.    

  • Loading...

More Telugu News