chiranjeevi: చిరంజీవికి కొత్త పదవినిచ్చిన కాంగ్రెస్ పార్టీ

  • పీసీసీ సభ్యుడిగా ఎంపిక
  • పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రాతినిధ్యం
  • 10న పీసీసీ సమావేశం, ఆపై అధ్యక్ష ఎన్నిక

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా మెగాస్టార్ చిరంజీవి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, చిరంజీవి స్వయంగా కోరడంతోనే ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బ్లాక్ 1 నుంచి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

 మొత్తం 17 మందిని పీసీసీ సభ్యులుగా జిల్లా నుంచి ఎంపిక చేశారు. ఈ నెల 10వ తేదీన విజయవాడలో పీసీసీ సర్వసభ్య సమావేశం జరుగనుండగా, ఆపై పీసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఇదిలావుండగా, ప్రస్తుతం కొవ్వూరు బ్లాక్ 1 నుంచి పీసీసీ సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేత అమరజహా బేష్, చిరంజీవి కోరిక మేరకు తన పదవిని వదులుకున్నారు. ఆమె స్థానంలో చిరంజీవికి స్థానం లభించింది.

  • Loading...

More Telugu News