adivi sesh: 'అడవి' సోదరులిద్దరూ రంగంలోకి దిగేశారు!

  • అడివి సాయికిరణ్ దర్శకత్వంలో మరో సినిమా
  •  హీరోగా ఆయన సోదరుడు అడివి శేష్ 
  •  సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు 
  •  త్వరలోనే పూర్తి వివరాలు

చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అడివి శేష్ .. 'క్షణం' సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. 'అమీ తుమీ' సినిమాతోను మంచి మార్కులు కొట్టేశాడు. ఈ క్రమంలో ఆయన హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందనేది తాజా సమాచారం. ఈ సినిమాకి ఆయన సోదరుడు అడివి సాయి కిరణ్ దర్శకత్వం వహించనుండటం విశేషం.

గతంలో సాయికిరణ్ 'వినాయకుడు' .. 'కేరింత' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు యూత్ లో ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. గవర పార్థసారధి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.      

  • Loading...

More Telugu News