suicide: హైదరాబాద్‌లో ఎంటెక్ విద్యార్థిని పూజిత ఆత్మ‌హత్య

  • రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో ఘటన
  • మరో మూడు రోజుల్లో ఆమెకు నిశ్చితార్థం 
  • కుటుంబ సభ్యులంతా షాపింగ్‌ వెళ్లిన సమయంలో ఉరివేసుకున్న పూజిత

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో ఓ ఎంటెక్ విద్యార్థిని ఆత్మ‌హత్య చేసుకుంది. ఆమెకు మరో మూడు రోజుల్లో నిశ్చితార్థం జ‌ర‌ప‌డానికి ఆమె కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకోవ‌డానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమె పేరు పూజిత అని, ఎంటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోందని చెప్పారు. కుటుంబ సభ్యులంతా షాపింగ్‌కు వెళ్లిన సమయంలో పూజిత ఫ్యానుకి ఉరేసుకుంద‌ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News