ntr: త్రివిక్రమ్ మూవీలో మిలటరీ ఆఫీసర్ గా ఎన్టీఆర్?

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ
  •  విభిన్నమైన పాత్రలో ఎన్టీఆర్
  •  త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు
  •  కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్

ఒక వైపున ఎన్టీఆర్ తాజా చిత్రంగా వచ్చిన 'జై లవ కుశ' వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. మరో వైపున ఎన్టీఆర్ తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా త్వరలో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో వున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్ తో సినిమా చేస్తోన్న త్రివిక్రమ్, ఆ తరువాత ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించే పాత్ర గురించిన ఆసక్తి అభిమానుల్లో వుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ సినిమాలో మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ సరదాగా విదేశాలకి వెళ్లి రానున్నాడు. ఈ లోగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తారట. 

  • Loading...

More Telugu News