neha shetti: తనయుడి కోసం కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసిన పూరీ!

  •  తనయుడితోనే పూరీ నెక్స్ట్ మూవీ
  •  హీరోయిన్ కోసం 200 మందికి ఆడిషన్స్
  •  కథానాయికగా నేహా శెట్టి ఎంపిక
  •  త్వరలోనే సెట్స్ పైకి    

పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమా తన తనయుడు ఆకాశ్ తో ఉంటుందని చెప్పారు. ప్రేమ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. ఈ సినిమాలో ఆకాశ్ జోడీగా కొత్త హీరోయిన్ ను పరిచయం చేయనున్నట్టు చెప్పారు. ఆ పని పూర్తయిందనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం 200 మంది అమ్మాయిలకి ఆడిషన్స్ నిర్వహించిన తరువాత, ఒక అమ్మాయిని ఆయన ఫైనల్ చేశారట. ఆ అమ్మాయి పేరే .. 'నేహా శెట్టి'.

 ఫోటో షూట్ .. ట్రైల్ షూట్ కూడా కానిచ్చేసిన పూరీ, ఈ అమ్మాయిని ఖాయం చేసేశాడని అంటున్నారు. క్రితం ఏడాది కన్నడలో 'ముంగారు మలే' చేసిన ఈ అమ్మాయి, ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది. పూరీ స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే కనుక, సాధ్యమైనంత త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎంతోమంది హీరోలకి హిట్స్ ఇచ్చిన పూరీ, తన తనయుడికి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.  

  • Loading...

More Telugu News