vijay devarakonda: మల్టీ స్టారర్ తరువాత మణిరత్నం చేసే మూవీలో విజయ్ దేవరకొండ!

  •  మల్టీ స్టారర్ మూవీ పనుల్లో మణిరత్నం
  •  ఆ తరువాత మూవీ లవ్ స్టోరీనే
  •  అందులో హీరోగా విజయ్ దేవరకొండ
  •  'అర్జున్ రెడ్డి' చూశాక మణిరత్నం తీసుకున్న నిర్ణయం  

తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. మణిరత్నం సినిమాలో విజయ్ దేవరకొండ ఛాన్స్ కొట్టేశాడనేది ఆ వార్త సారాంశం. ప్రస్తుతం మణిరత్నం ఒక మల్టీ స్టారర్ ను తెరకెక్కించే పనిలో వున్నారు. ఈ సినిమాలో శింబు .. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. జ్యోతిక .. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు.

 ఈ సినిమా తరువాత మణిరత్నం మళ్లీ ఒక లవ్ స్టోరీని ప్లాన్ చేశారట. ఆ కథకి తగిన హీరో కోసం చూస్తున్న ఆయనకి విజయ్ దేవరకొండ దృష్టిలోకి వచ్చాడని సమాచారం. 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని చూసిన మణిరత్నానికి విజయ్ దేవరకొండ నటన కూడా బాగా నచ్చిందట. దాంతో ఆయనని హీరోగా ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. మణిరత్నం సినిమాలో ఛాన్స్ కోసం కొంతమంది యంగ్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, ఆ ఛాన్స్ విజయ్ దేవరకొండకి చాలా తక్కువ సమయంలో వచ్చేయడం విశేషం.  

  • Loading...

More Telugu News