mobile: శుభవార్త.. తగ్గనున్న మొబైల్ కాల్ ధరలు!


మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌కు ట్రాయ్ (భార‌త‌ టెలికం రంగ నియంత్రణ సంస్థ) శుభ‌వార్త చెప్పింది. ఇంట‌ర్ క‌నెక్ష‌న్ ఛార్జీ (ఐయూసీ) ల‌ను నిమిషానికి 14 పైస‌ల నుంచి 6 పైస‌ల‌కు త‌గ్గిస్తున్నట్లు చెప్పింది. త‌గ్గించిన ఈ ఛార్జీలు వ‌చ్చేనెల 1 నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని పేర్కొంది. ఇంట‌ర్ క‌నెక్ష‌న్ ఛార్జీల‌ను తగ్గించాల‌ని భార‌త టెలికాం రంగ సంస్థ‌ రిలయన్స్ జియో చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది. దీనిపై ఎట్ట‌కేల‌కు ఓ నిర్ణ‌యం తీసుకున్న ట్రాయ్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అంతేగాక‌, జ‌న‌వ‌రి 1, 2020 నుంచి ఈ ఛార్జీల‌ను పూర్తిగా ఎత్తివేస్తామ‌ని తెలిపింది. దీంతో వినియోగదారులకు మొబైల్ కాల్ ధరలు తగ్గనున్నాయి.   

  • Loading...

More Telugu News