sindhu: స్వీట్‌ రివేంజ్.. నిన్ను చూసి భారత్‌ గర్వపడుతోంది సింధూ.. కొరియా ఓపెన్ సిరీస్ విజేతకు అభినందనల వెల్లువ

  • పీవీ సింధుకి రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖుల అభినందనలు 
  • మరోసారి త్రివర్ణ పతాకం గ‌ర్వంగా ఎగిరేలా చేశావన్న చంద్రబాబు

కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌లో విజ‌య దుందుభి మోగించిన భార‌త స్టార్ షట్ల‌ర్ పీవీ సింధుపై దేశంలోని ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణి కావ‌డంతో సింధుకి శుభాకాంక్ష‌లు చెప్ప‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. 'మరోసారి మ‌న‌ త్రివర్ణ పతాకం గ‌ర్వంగా ఎగిరేలా చేశావు సింధూ' అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. 'నిన్ను చూసి భారత్‌ గర్వపడుతోంది సింధూ' అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

 పీవీ సింధు 22 ఏళ్ల వయసులోనే ఓ లెజెండ్‌గా మారిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. స్వీట్‌ రివేంజ్ అంటూ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్ సింధుకి అభినంద‌న‌లు తెలిపారు. సింధుకి మ‌రెంద‌రో రాజ‌కీయ, క్రీడా, సినిమా రంగాల ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. బాక్సర్‌ విజేందర్‌ సింగ్, మలయాళీ నటుడు మోహన్‌లాల్, మహ్మద్‌ కైఫ్‌, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ సింధుని అభినందించారు.

  • Loading...

More Telugu News