ntr: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు రెడీ అవుతోన్న ఎన్టీఆర్!


ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'జై లవకుశ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క, ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో వుంటుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా పూర్తి కాగానే, ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

 ఈ సినిమాలో ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ తో శత్రువులపై విరుచుకుపడవలసి వుంటుందట. థాయ్ ల్యాండ్ .. ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ను తెరపై చూపించనున్నట్టు సమాచారం. ఈ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడానికి ఎన్టీఆర్ ఆగ్నేయ ఆసియా వెళ్లనున్నట్టు సమాచారం. తొలిసారిగా తన దర్శకత్వంలో చేస్తోన్న ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ కొత్తగా చూపించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు .. సంగీత దర్శకుడిగా అనిరుధ్ పేరు వినిపిస్తోంది.      

ntr
  • Loading...

More Telugu News