dil raju: 'ఫిదా' జోలికి వెళ్లేది లేదంటున్న దిల్ రాజు!


దిల్ రాజు నిర్మాణంలో భారీ స్థాయిలో 'ఫిదా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకి మించి ఈ సినిమా ఆదరణ పొందుతోంది. ఈ సినిమా తరువాత 'నేనే రాజు నేనే మంత్రి' .. 'జయ జానకి నాయక' .. 'లై' సినిమాలు రంగంలోకి దిగాయి. ఈ మూడు సినిమాలు కూడా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయినా 'ఫిదా' తన దూకుడును కొనసాగిస్తూనే వుంది.

 దాంతో ఇప్పట్లో ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసే ఆలోచన లేదని దిల్ రాజు అంటున్నారట. ఈ వారం కొన్ని సినిమాలు విడుదల కావలసి వుంది. అయితే 'ఫిదా'ను థియేటర్ల నుంచి తీయడానికి దిల్ రాజు అంగీకరించపోవడంతో, ఒక్క 'ఆనందో బ్రహ్మ' మాత్రమే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ కామెడీగా వస్తోన్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.     

  • Loading...

More Telugu News