chaitu: 'యుద్ధం శరణం'తో చైతూ దూకుడు .. రిలీజ్ డేట్ ఫిక్స్!


నాగచైతన్య కథానాయకుడిగా 'యుద్ధం శరణం' సినిమా తెరకెక్కింది. కృష్ణ ఆర్.వి.మరిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 8న విడుదల చేయవచ్చనే టాక్ వచ్చింది. అదే డేట్ ను ఖరారు చేస్తూ ఈ సినిమా టీమ్ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

 సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ పూర్తిస్థాయి విలన్ గా చేయడం విశేషం. ఆయన పాత్ర .. నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే చైతూ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది. ఈ సినిమా తరువాత చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ చేయనున్న మూవీకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News