nithin: పోటీ నుంచి తప్పుకుంటున్న నితిన్?


ఆగస్టు 11 తరువాత వరుసగా సెలవులు వస్తున్నాయి. దాంతో ఆ రోజున తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి కొంతమంది దర్శక నిర్మాతలు .. హీరోలు ఉత్సాహాన్ని చూపారు. 'జయ జానకి నాయక' .. 'లై' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాయి.

 అయితే ఈ పోటీలో నుంచి తప్పుకోవాలని నితిన్ .. ఆయన దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో 'లై' సినిమాను తెరకెక్కించారు. అందుకు తగిన వసూళ్లను రాబట్టాలంటే, ఈ పోటీ వాతావరణంలో విడుదల చేయకపోవడమే మంచిదని భావించారట. రెండు .. మూడు రోజుల్లో ఈ విషయంపై ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.  

  • Loading...

More Telugu News