bellamkonda srinivvas: 'జయ జానకి నాయక'లో ఒక పాట కోసం 3 కోట్ల ఖర్చు?


రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్లో '2.0' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాట కోసం 5 కోట్లను ఖర్చు చేయనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే మరో ఆశ్చర్యకరమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదీ 'జయ జానకి నాయక' సినిమాను గురించి.

 ఈ సినిమా కోసం రీసెంట్ గా ఒక సాంగ్ ను చిత్రీకరించారట. విశాఖ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఈ సాంగ్ ను చిత్రీకరించారట. ఇందుకోసం లండన్ నుంచి పెద్ద సంఖ్యలో డాన్సర్లను పిలిపించడమే కాకుండా భారీగా ఒక సెట్ ను వేశారని అంటున్నారు. ఈ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. ఈ సాంగ్ చిత్రీకరణకు దాదాపు 3 కోట్లు అయిందని చెబుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాంగ్ కి ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం విశేషమే మరి.             

  • Loading...

More Telugu News