up elections: మోదీ ప్రజల్ని పిచ్చోళ్లని చేసిన‌ప్పుడు.. నేనెందుకు చేయ‌లేను?: ఎన్నిక‌ల‌కు దిగుతున్న‌ అభ్యర్థి వ్యాఖ్య‌లు


ఉత్తర ప్రదేశ్‌లో మ‌రికొన్ని రోజుల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ బ‌రిలో దిగుతున్న అభ్య‌ర్థులు మాట‌ల తూటాలు వ‌దులుతున్నారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారానే పాప్యులారిటీ సంపాదించుకోవ‌చ్చ‌ని, ఓట‌ర్ల‌ను రెచ్చ‌గొడితేనే ఓట్లు ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. తాజాగా ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చౌదరి బహిరంగంగా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాను డబ్బుకోసమే రాజకీయాల్లోకి వచ్చానని స‌ద‌రు అభ్య‌ర్థి కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు. కేవలం అందుకోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్రజల్ని ఫూల్స్ చేస్తానని చెప్పాడు.

దాదాపు అందరూ రాజకీయాల్లోకి  పరోక్షంగా ఇదే ఉద్దేశంతో వస్తున్నారని కూడా చౌదరి వ్యాఖ్య‌లు చేశారు. అంతేగాక‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల్ని పిచ్చోళ్లని చేసి, ఒక వ్యక్తి దేశాన్నేలుతున్నార‌ని, మ‌రి తానెందుకు చేయలేనని ఉద్ఘాటించారు. తానూ మోదీ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని చెప్పారు. ప్రజలను అవివేకుల‌ని చేసిన ఎవరైనా ప్రధాని అయిపోవ‌చ్చని, అందుకోసం కాసింత నైపుణ్యం ఉండాలని ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  • Loading...

More Telugu News