special status: ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోదీని చంద్ర‌బాబు 26 సార్లు క‌లిశారు: ఎమ్మెల్సీ గాలి


ప్రత్యేక హోదా పేరుతో వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేస్తున్నార‌ని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు 26 సార్లు క‌లిశారని అన్నారు. ఆనాడు అప్ర‌జాస్వామికంగా ఏపీ విభ‌జ‌న బిల్లును ఆమోదింప‌జేశారని ఆయ‌న అన్నారు. విభ‌జ‌న పాపం కాంగ్రెస్‌, బీజేపీల‌దే అని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుతుంటే ప్ర‌తిప‌క్షాలు మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయ‌ని అన్నారు.

రాష్ట్ర‌ యువ‌త‌ను రెచ్చ‌గొట్టేలా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్తిస్తున్నారని గాలి ఆరోపించారు. నాడు చంద్ర‌బాబు హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశారని, నేడు అమ‌రావ‌తిని కూడా ఆ దిశ‌గానే న‌డిపిస్తున్నారని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు ఏపీని ఇన్ని ర‌కాలుగా అభివృద్ధి చేస్తోంటే జ‌గ‌న్ మాత్రం ఎన్నో విమ‌ర్శ‌లు చేస్తున్నారని అన్నారు. ప‌రిశ్ర‌మ‌లు రావ‌ట్లేదంటూ అస‌త్యారోప‌ణ‌లు చేస్తున్నారని అన్నారు. అవినీతికి తావులేకుండా రాష్ట్రంలో పాల‌న కొన‌సాగుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News