demonitisation: రూ.31.5 లక్షల పాతనోట్లను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ షాలిమార్‌ గార్డెన్‌ ప్రాంతంలో పోలీసులు ఓ కారులో పాత నోట్లను తరలిస్తున్న ప‌లువురు వ్య‌క్తుల‌ను గుర్తించారు. నోట్లను త‌ర‌లిస్తోన్న ప్రమ్‌జిత్‌ సింగ్‌, రిషీ కపూర్‌, శ్యామ్‌వీర్ ల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని అతుల్‌ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడ‌ని పోలీసులు మీడియాకు చెప్పారు.

నిందితుల‌ని విచారించ‌గా 45 శాతం కమీషన్‌పై కొత్త కరెన్సీలోకి మార్చేందుకు వీటిని తీసుకువెళ్తున్నట్లు అంగీక‌రించారు. ఒక ఎన్నారై సాయంతో పాత నోట్లను మార్చిపెడతానని అతుల్‌ తమకు చెప్పినట్లు ప‌ట్టుబ‌డిన వ్య‌క్తులు విచార‌ణ‌లో తెలిపారు. కారులో మొత్తం రూ.31.5 లక్షల విలువైన రద్దయిన పాత నోట్లు ఉన్నాయ‌ని, వాటిని స్వాధీనం చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News